ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి

ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి

బిల్డింగ్ లో మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈస్ట్ ఢిల్లీ, శాస్త్రీ నగర్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్థలంలో మంటలు అలుముని  పెద్ద ఎత్తున వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం పొగ కమ్ముకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపు చేశారు. 

ఈ ప్రమాదంలో ఓ కారు, బైక్ లు కాలి బూడిదయ్యాయి.  పొగతో ఊపిరాడక సృహ కోల్పోయిన మగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇందులో ఇద్దరు పిల్లలతోపాటు ఇద్దరు దంపతులు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతులను మనోజ్(30), భార్య సుమన్(28), ఐదేళ్ల ఇద్దరు బాలికలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.