
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్ట్ల డంప్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మెట్టగూడ బేస్ క్యాంప్ పరిధిలోని ఎరాపల్లి, కోయిమెంట, దరేలీ, బోటెలంక, మార్కన్గూడ అడవుల్లో కోబ్రా, సీఆర్పీఎఫ్, బస్తర్ఫైటర్స్జవాన్లు కూంబింగ్చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్లు దాచిపెట్టిన రైఫిల్స్, బీజీఎల్ లాంచర్లు, లాంచర్ బ్యారెల్స్, విరిగిన యుఏవీ నేత్రా ప్రొపెల్లర్, ఎలక్ట్రిక్ హోల్డర్ వెల్డింగ్, బెంచ్ వైస్, స్టీల్పైపులు, ఇనుప రాడ్స్, ఇనుప బేస్ప్లేట్, పోల్ యాంగ్లర్, ఇనుప క్లాంప్, గ్రౌండ్ సపోర్టర్, బ్లాక్ యూనిఫామ్స్, మందుగుండు సామగ్రి, విరిగిన ఇన్వర్టర్ బ్యాటరీ కేసింగ్, ఎలక్ట్రిక్ వైర్, ఎక్స్టెన్షన్ బోర్డును స్వాధీనం చేసుకొని జిల్లా కేంద్రానికి తరలించారు.