రైతు వ్యతిరేకి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి : యాదగిరి సునీల్ రావు

రైతు వ్యతిరేకి  రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి : యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్,వెలుగు : టీపీసీసీ చీఫ్​ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మానిక్ రావ్ ఠాక్రే  రైతు వ్యతిరేకులని మేయర్ యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు.  శుక్రవారం సిటీలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేయడం వారికి రైతులపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనమన్నారు. గతంలో రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రైతులకు 3గంటలే కరెంట్ సరిపోతుందని చెప్పాడని గుర్తుచేశారు.

కరీంనగర్​నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో   కార్పొరేటర్లు గందె మాధవి, సరిత, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జయశ్రీ, రమణరావు, వేణు,యాదయ్య, మాలతి  రెడ్డి, శ్రీదేవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.