పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎంసీ కోటిరెడ్డి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎంసీ కోటిరెడ్డి

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్​ఎడమకాల్వ కింద పంటసాగు చేసిన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్​ కోరారు. ఆదివారం నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సమయం లేకపోవడంతో  కేసీఆర్​నాగార్జునసాగర్ నియోజకవర్గ బస్సు యాత్రను రద్దు చేసినట్లు తెలిపారు.

సోమవారం నల్గొండ పట్టణంలో కేటీఆర్ పర్యటించనున్నట్లు చెప్పారు. కేటీఆర్​పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి వెంట నాయకులు కేవీ రామారావు, కట్టెబోయిన గర్వయ్య యాదవ్​, ఎంపీపీలు సుమతీపురుషోత్తం, బొల్లం జయమ్మ, విరిగినేని అంజయ్య, బాబూరావునాయక్, నాయకులు​తదితరులు ఉన్నారు.