
మెదక్టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో హైమావతి సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని బోయిగల్లి, పిట్లంబేస్ అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్జయంతితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవల గురించి ఆరాతీశారు. పదో తరగతి పాసైన స్టూడెంట్స్చదువుకు ఫుల్స్టాప్పెట్టకుండా ఇంటర్చేరేలా అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. వారి తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యం గురించి వివరించాలన్నారు. ఆమె వెంట టీచర్లు తేజమణి, స్మరణ ఉన్నారు.