
జర్నలిస్టులకు, కెమెరామెన్లకు కర్ణాటక స్పీకర్ ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలోకి మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి ఫిబ్రవరి 18న నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఎప్పుడుపడితే అప్పుడు అసెంబ్లీలోకి రాలేవు అని స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవేళ ఎమ్మెల్యేలతో మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ గేటు బయటే మాట్లాడాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గేటు లోపలికి ఏ జర్పలిస్టును లేదా కెమెరామెన్ను అనుమతించరని కూడా పేర్కొంది. ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల నుండి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తారు. ఆ సమయం వారికి చాలా ముఖ్యమైనది. అటువంటి సమయంలో జర్నలిస్టులు వచ్చి ఎమ్మెల్యేల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ తెలిపారు.
For More News..