మే 18న గోదావరిఖనిలో మెగా జాబ్‌‌మేళాను వినియోగించుకోండి : డి.లలిత్​కుమార్

మే 18న గోదావరిఖనిలో మెగా జాబ్‌‌మేళాను వినియోగించుకోండి : డి.లలిత్​కుమార్

గోదావరిఖని, వెలుగు: ఈ నెల 18న గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్‌‌లో నిర్వహించనున్న మెగా జాబ్​మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​కుమార్​ కోరారు. మంగళవారం జీఎం ఆఫీస్​లో జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌‌కు చెందిన నోబుల్​ ఎడ్యుకేషనల్​ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌ సొసైటీ సౌజన్యంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం ఈ జాబ్‌‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జాబ్‌‌మేళా నిర్వహించే సింగరేణి కమ్యూనిటీ హాల్‌‌ను ఆఫీసర్లు, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి జీఎం పరిశీలించారు. 10 వేల మంది నిరుద్యోగులకు సరిపడేలా  సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీఎం డి.లలిత్​కుమార్ ​వివరించారు.