ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళా హెల్త్ క్యాంప్లు షురూ..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళా హెల్త్ క్యాంప్లు షురూ..

మహబూబ్​నగర్/ కందనూలు/ ఖిల్లాగణపురం, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం స్వస్త్​ నారీ.. సశక్త్​ పరివార్​ అభియాన్​ లో భాగంగా మెగా క్యాంప్​లు ప్రారంభమయ్యాయి. నారాయణపేట మండలం అప్పక్​పల్లి గ్రామ శివారులోని జిల్లా ఆసుపత్రిలో మెగా హెల్త్​ క్యాంప్​ను ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే పలు రకాల టెస్టులు చేయించుకున్నారు. మెగా హెల్త్ క్యాంప్​లో మహిళలు, చిన్న పిల్లలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

 నాగర్ కర్నూల్​ జిల్లా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హెల్త్​ క్యాంప్​ను ప్రారంభించారు. మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామాల్లో వైద్య శిబిరాలను  నిర్వహిస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఖిల్లాగణపురం పీహెచ్​సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్  సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.