Weather update: మార్చిలోనే మాడు పగులిద్ది.... ఐఎండీ హెచ్చరిక

Weather update: మార్చిలోనే మాడు పగులిద్ది.... ఐఎండీ హెచ్చరిక

ప్రతి ఏడాది శివరాత్రికి శివ.. శివ అంటూ చలి పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  కాని ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో వేడి మొదలైంది.  మార్చి నుంచి మే వరకు  అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.  వాయువ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం, మధ్య భారతదేశం లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ పేర్కొంది. 

ఈ ఏడాది  భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.   రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన, చెమటతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో మార్చి మొదటి వారంలో  వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  పిడుగులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు.  మార్చి 2న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని ఐఎండీ తెలిపింది.