హైద‌‌‌‌రాబాద్‌‌‌‌ మార్కెట్లోకి ఎంజీ విండ్సర్​ ప్రో

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌ మార్కెట్లోకి ఎంజీ విండ్సర్​ ప్రో

హైదరాబాద్​, వెలుగు: జేఎస్‌‌‌‌డ‌‌‌‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్​ కారు విండ్సర్​ ప్రో హైదరాబాద్​లో శనివారం విడుదల అయింది.  నగరానికి చెందిన పీపీఎస్ మోటార్స్ ఎల్బీ నగర్​ ఎంజీ షోరూంలో దీనిని ఆవిష్కరించింది.   మొదటి 8,000 మంది వినియోగదారులకు రూ.17.49 లక్షల ఎక్స్​షోరూం ధరకు అందిస్తారు. బ్యాటరీ యాజ్​ఏ సర్వీస్​(బీఏఏఎస్​) విధానంలో ఎక్స్​షోరూం ధర రూ.12.49 లక్షలు ఉంటుంది. 

బ్యాటరీ కిరాయి కిలోమీటరుకు రూ.4.5 చొప్పున చెల్లించాలి. ఇందులోని 52.9 కిలోవాట్​అవర్​ బ్యాటరీని  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.  విండ్‌‌‌‌సర్ ప్రోలోని ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌ 136 హెచ్​పీ శక్తిని,  200 ఎన్​ఎం  టార్క్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్  లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి 12 ఫీచర్లు ఉన్నాయి.  

పవర్డ్ టెయిల్‌‌‌‌గేట్, కొత్త అల్లాయ్ వీల్స్,  అప్‌‌‌‌డేటెడ్ ఇంటీరియర్స్, 15.6-అంగుళాల టచ్‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌‌‌‌ప్లే,  పనోరమిక్ గ్లాస్ రూఫ్,  వైర్‌‌‌‌లెస్ ఫోన్ ఛార్జర్,  ఆటో హోల్డ్‌‌‌‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌‌‌‌బ్యాగ్‌‌‌‌లు,  నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌‌‌‌లు వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.