
సుల్తానాబాద్, వెలుగు : మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రాష్ట్ర సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో బడుల్లో స్టూడెంట్స్కు భోజనం కరువైంది. దీంతో వారికి వినాయక మండపాలే దిక్కయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్థానిక గాంధీ నగర్ మండపం వద్ద ఏడు రోజులుగా అన్నదానం చేస్తుండగా పక్కనే ఉన్న జడ్పీ హైస్కూల్ పిల్లలు రోజూ ఇక్కడే తింటున్నారు. మంగళవారంతో అన్నదాన కార్యక్రమం ముగియగా విద్యార్థులకు మళ్లీ బువ్వ తిప్పలు మొదలుకాబోతున్నాయి.