
జోగిపేట, పుల్కల్, వెలుగు: ఆందోల్, చౌటకూర్ మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం మంత్రి దామోదర పరిశీలించారు. చౌటకూర్ మండల కేంద్రంలో కేజీబీవీ, పీహెచ్సీ, పీఎస్భవనాల నిర్మాణాల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీలో ప్రహరీ నిర్మాణ పనులు తనిఖీ చేశారు. కాలేజీ ఆడిటోరియం, 200 అడుగుల టవర్, సైన్స్ ల్యాబ్ లు నిర్మాణంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు అందించిన 100 సైకిళ్లను మంత్రి పరిశీలించారు.
స్వయంగా సైకిల్ తొక్కుతూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం జోగిపేటలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చౌటకూర్ మండలంలోని ఒక హోటల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. హోటల్లోని వంటగదిని పరిశీలించి , ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో పాండు, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.