
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి తండ్రి బండారి రామస్వామి(80) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గనులు, కార్మిక శాఖ మంత్రి డాక్టర్గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామస్వామి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట దిశ కమిటీ మెంబర్సయ్యద్ సజ్జాద్, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్పటేల్, బండారు సునీల్ తదితరులు ఉన్నారు.