మహబూబ్ నగర్ జిల్లాలో జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి

మహబూబ్ నగర్ జిల్లాలో జంగిల్ సఫారీని ప్రారంభించిన మంత్రి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని 26 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎకో పార్కులో జంగిల్ సఫారీని, రెండు సఫారీ వెహికల్స్​ను ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్​ జెండా ఊపి ప్రారంభించారు. ఎకో పార్కులో రూ.2.70 కోట్లతో నిర్మించనున్న బర్డ్స్ ఎన్ క్లోజర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం సఫారీ వెహికల్​లో వాచ్ టవర్  వరకు ప్రయాణించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేలా జంగిల్  సఫారీని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎకో పార్కులో వేలాది పక్షులతో బర్డ్స్ ఎన్ క్లోజర్  ప్రారంభించడం సంతోషకరమని ఎంపీ సంతోష్ కుమార్  తెలిపారు. కలెక్టర్  జి.రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్  కేసీ నర్సింలు పాల్గొన్నారు.