భారీ వర్షాలతో అలర్ట్గా ఉండాలి : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

 భారీ వర్షాలతో అలర్ట్గా ఉండాలి :  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ వెంకటేశ్ ధోత్రేతో ఫోన్​లో మాట్లాడారు.

 జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన బెజ్జూరు, పెంచిక‌ల్​పేట్, ద‌హెగాం మండ‌లాల ప్రజలను అప్రమత్తం చేయాల‌ని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.