హైదరాబాద్ నగరంలో పార్కుల అభివృద్ధి పై GHMC ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తోంది. దోమలగూడలోని ఇందిరా పార్కులో ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేశారు. ఈ పార్క్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆదివారం) ప్రారంభించారు.
సర్కిల్ పద్దతిలో ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 MM, 10 MM రాళ్లు, రివర్ స్టోన్స్, 6 MM చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్ను నిర్మించారు. ఈ సర్కిల్కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ ప్లాంట్స్ను బ్లాక్లుగా ఏర్పాటు చేశారు. మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటంతో రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్నిఏర్పాటు చేశారు.