న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలర్ట్గా ఉంటే సరిపోతుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. జేఎన్1 వేరియంట్ కేసులు కూడా పలు రాష్ట్రాల్లో నమోదైనట్లు వివరించారు. అన్ని హాస్పిటల్స్లో కరోనా వార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైన హెల్త్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత న హై లెవల్ మీటింగ్ జరిగింది.
ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంకా కరోనా వైరస్ పోలేదు. అన్ని రాష్ట్రాలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే.. అలర్ట్గా ఉండండి. ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి. హాస్పిటల్స్లో సౌలత్లు ఏర్పాటు చేసుకోండి. ప్రజలకు అవగాహన కల్పించండి. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుంది. ప్రజల హెల్త్కు సంబంధించిన విషయం ఇది. దీన్ని రాజకీయం చేయొద్దు” అని మన్సుఖ్ మాండవీయ కోరారు.