అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జనగామ: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజు పల్లిలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందినవాడు కాదని, ఆయన అందరివాడని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ తర్వాత దళితుల అభివృద్ధి కోసం పాటుపడిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. అందుకే కేసీఆర్ ను ప్రతి ఒక్కరూ అభినవ అంబేద్కర్ అని అంటున్నారని తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా ఎంతో మంది దళిత విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ