భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్  
  • పాల్గొన్న మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఆఫీసర్లు

మెదక్​ టౌన్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరో 24 గంటల పాటు అన్ని జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని  ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా సీనియర్​ అధికారులను నియమించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు.  గురువారం సీఎం రేవంత్​ రెడ్డి సూచనల మేరకు సచివాలయం నుంచి సీఎస్​ రామకృష్ణారావుతో కలిసి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో రెండు మూడు రోజుల పాటు భారీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు ఉంటాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వాతావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు. 

అడిషనల్​ కలెక్టర్​ నగేష్​ పాల్గొనగా... రాబోయే 24 గంటలు రెడ్​ అలెర్ట్​గా ఉన్న మెదక్​, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాలకు సీనియర్​ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. సెలవుల్లో ఉన్న అధికారులు,  సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్​ రాహుల్​రాజ్​మాట్లాడుతూ..  మెదక్​ జిల్లా వ్యాప్తంగా రెడ్​అలెర్ట్​ ప్రకటించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వీడియో కాన్ఫరెన్స్​లో వివరించారు.