కొందరికి బీసీ రిజర్వేషన్లు అమలు కావొద్దని ఉంది : మంత్రి సీతక్క

కొందరికి బీసీ రిజర్వేషన్లు అమలు కావొద్దని ఉంది : మంత్రి సీతక్క
  • త్వరలో ప్రధానిని సీఎం కలుస్తరు : మంత్రి సీతక్క

కామారెడ్డి​, వెలుగు: కొంత మందికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావొద్దని ఉందని మంత్రి సీతక్క తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, ఈ అంశంలో సీఎం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తారని చెప్పారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్​లో వివిధ పథకాల అమలుపై రివ్యూ చేశారు. ఇందిర మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్​రెడ్డి, కె.మదన్​ మోహన్​రావు, తోట లక్ష్మీకాంతరావు, ఎంపీ సురేశ్​ షెట్కార్, మహిళ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై తీసుకొచ్చిన అర్డినెన్స్​కు గవర్నర్​ అమోదం పొందాల్సి ఉందన్నారు. కొందరు బీసీ కుల గణనలో కూడా పాల్గొనలేదని విమర్శించారు. కామారెడ్డి వేదికగా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అంగన్​వాడీ టీచర్, ఆయా ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.