
నిజామాబాద్, వెలుగు: కార్యకర్తలే పార్టీకి బలమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నగరంలోని ఈవీఎం గార్డెన్లో జరిగిన నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల కాంగ్రెస్ శ్రేణుల మీటింగ్లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడిగా ఉండడాన్ని ప్రతి కార్యకర్త గర్వంగా భావించాలన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు
గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ మధ్య సమరం
ప్రధాని మోదీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్, మోదీ మధ్య సమరం నడుస్తోందన్నారు. బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చార్ సౌ పార్ అని చతికిలబడి పొత్తులతో లాక్కోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 4న మల్లికార్జున ఖర్గే సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఈరవత్రి అనీల్, మానాల మోహన్రెడ్డి, తాహెర్, అన్వేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.