అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీలో బీసీ  బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.  ఈ సభలో మంత్రి శ్రీధర్​ బాబు  బీసీ రిజర్వేషన్​ బిల్లును ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లపై 50 శాతాన్ని ఎత్తివేస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.  బీసీలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని  మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్​ అమలు చేసేందుకు బిల్లును  సవరిచాలని కోరారు.