మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెంచులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెంచులకు పుస్తకాలిస్తే ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించిన ఆయన ఈ కామెంట్లు చేశారు. "అచ్చంపేట పోయి చెంచులకు పుస్తకాలిస్తే.. చెంచులు ఏం చేసుకుంటరు.. ప్రజాసేవ చేస్తే చూస్తరు కానీ పుస్తకం ఇస్తే ఏం చేస్తరని.." శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చెంచులపై ఇలాంటి కామెంట్లు చేసిన ఆయన మరోవైపు పుస్తకాలు చదివే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించడానికి కారణమే పుస్తకాలని చెప్పారు.
For More News :