గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి : మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి : మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక, ఉపాధి, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళవారం (సెప్టెంబర్ 03) గోదావరిఖనిలో 40వ డివిజన్​ పరిధిలోని వివేకానంద యూత్, 50వ డివిజన్​పరిధిలోని కళ్యాణ్​నగర్​యూత్, వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్​ మండపాలను మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని చుట్టి రమ్మని చెబితే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి మీరే తన ప్రపంచమని చాటిన గణనాథుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని శాలువాలతో సత్కరించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్​ దుబాసి లలిత, మల్లేశ్‌‌‌‌‌‌‌‌, లీడర్లు పి.మల్లికార్జున్​, కుమారస్వామి, కోటేశ్వర్లు, విజయ్​, మధు, నర్సింగ్​ దొర, మధు, నరేందర్​ రెడ్డి, దీపక్​, రవికుమార్​, మహేశ్‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.