
- అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ
- శ్రీవారాహి సెలెక్షన్స్’ వస్త్రాలయం ప్రారంభం
మలక్పేట, వెలుగు: వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యమని, అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సైదాబాద్లోని వినయ్ నగర్ కాలనీలో ‘శ్రీవారాహి సెలెక్షన్స్’ వస్త్రాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి స్నేహితులైన బుంగ శివకుమార్ కుటుంబ సభ్యుడు రమేశ్ కడమంచి నెలకొల్పిన ఈ వస్త్రాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శివకుమార్ కుటుంబంతో కాకా వెంకటస్వామి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.
కాగా, మంత్రి వివేక్ వెంకటస్వామిని శ్రీవారాహి సెలెక్షన్స్ యజమాని రమేశ్, కాకా వెంకటస్వామి అభిమానులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీవారాహి సెలెక్షన్స్ ప్రొప్రైటర్ శైలజ, ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, గడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.