ఓదెల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

ఓదెల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామినీ దర్శించుకున్నారు  కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒగ్గు డోలు చప్పుళ్ళు,కావడి సళ్లతో ఘనస్వాగతం పలికారు గొల్లకురుమలు. పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు  ఆలయ అర్చకులు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు  మంత్రి వివేక్ వెంకటస్వామి. తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు  ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు.

ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. నాకు మంత్రి పదవి వస్తె నూటొక్క కొబ్బరి కాయలు కొడతా అని నా అభిమాని అల్లం సతీష్ మొక్కుకున్నారు. మొక్కు తీర్చడానికి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయాన్ని మా నాన్న కాక వెంకటస్వామి ఎన్నోసార్లు దర్శించుకున్నారు. ఈ ఆలయానికి ప్రజల సౌకర్యార్థం కాక వెంకటస్వామి సీసీ రోడ్డు నిర్మించారు. వంశీకృష్ణ ఎంపీ నిధుల నుంచి ఆలయ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తామని అన్నారు. 

అంతకు ముందు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బీ 1 గెస్ట్ హౌస్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని  మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.   ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. దివంగత నేత కాకా వెంకటస్వామి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపించేవారని చెప్పారు. గత ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి పాటు పడలేదన్నారు. కేంద్రప్రభుత్వం బొగ్గు గనుల యాక్షన్ లో పాల్గొనాలని సూచిస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం  మైన్ అలాంట్  మెంట్ కు  ప్రాధాన్యత ఇచ్చిందన్నా రు. తెలంగాణ లోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. సింగరేణి సంస్థ పైనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.