నియోజకవర్గంలో మంత్రి వివేక్ సుడిగాలి పర్యటన

 నియోజకవర్గంలో మంత్రి వివేక్  సుడిగాలి పర్యటన

కోల్​బెల్ట్/ జైపూర్/​ చెన్నూరు​,వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి ఆదివారం మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి, జైపూర్ మండలాల్లో విస్తృతంగా  పర్యటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్​ఆర్​ గార్డెన్స్​లో అజిత్​గౌడ్  ​-ప్రజ్ఞ  వివాహానికి, పులిమడుగులో బానోత్​ఇందు- కిశోర్​ల నిశ్చితార్థానికి మంత్రి వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మందమర్రిలోని బి-1 క్యాంపు ఆఫీస్​లో మంత్రికి క్యాతనపల్లి మున్సిపల్​ మాజీ మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ మహిళ లీడర్లు రాఖీలు కట్టారు. 

మందమర్రి మండలంలోని వెంకటాపూర్​ పంచాయతీలోని దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని మంత్రి వివేక్​ వెంకటస్వామికి గ్రామ రైతులు, వివిధ సమస్యలపై పలువురు వినతిపత్రాలు  అందజేశారు. మందమర్రి బి-1 క్యాంపు ఆఫీస్​లో పట్టణానికి చెందిన కాంగ్రెస్​ లీడర్​ ముడారపు శేఖర్​ బర్త్​డే వేడుకలను మంత్రి సమక్షంలో నిర్వహించారు. 

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి 

చెన్నూరు, జైపూర్​ మండలాలకు చెందిన బాధిత కుటుంబాలను మంత్రి వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు.  చెన్నూరు పట్టణానికి చెందిన రిపోర్టర్​ గట్టు సత్యనారాయణ తల్లి లక్ష్మి, జైపూర్​ మండలం వేలాల గ్రామానికి చెందిన ఎంఆర్​పీఎస్​ లీడర్​ సుందిళ్ల మల్లేశ్​ తల్లి శంకరమ్మ, మాజీ సర్పంచి శ్యామల బంధువు రాజేశ్వరి, కాంగ్రెస్ కార్యకర్త సాయిలు అమ్మమ్మ కొమురయ్య, కిష్టాపూర్​ కాంగ్రెస్​ లీడర్​ లంబు గణపతిరెడ్డి కోడలు వాణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కాగా బాధిత కుటుంబాలను కలిసి మంత్రి పరామర్శించారు.