
తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ చిత్రం చక్కని వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో ఎంతగానో పాపులర్ అయిన ‘వైబ్ ఉంది’ సాంగ్ సినిమాలో లేకపోవడం పట్ల ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి థియేటర్స్లో ఈ పాటను యాడ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
గౌర హరి కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ పాడాడు. తేజ, రితికా నాయక్ జంటపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రమోషన్స్లో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్తో ముందుకెళుతోంది. ఈ పాటను యాడ్ చేయడం వల్ల కలెక్షన్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.