కేంద్ర నిధులు దుర్వినియోగం

కేంద్ర నిధులు దుర్వినియోగం

ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్​, వెలుగు: అభివృద్ధి, డబుల్​ బెడ్​రూంల నిర్మాణానికి  కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులను బీఆర్​ఎస్​ నాయకులు  సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారని మహారాష్ర్ట ఎమ్మెల్యేలు అన్నారు.  ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చలో  కలె క్టరేట్  నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్​ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.   ఈ  సందర్భంగా కేలాపూర్​ఎమ్మెల్యే సందీప్​ దుర్వే, గడ్చిరోలి  ఎమ్మెల్యే దేవ్ రావు మడ్ గూజి హోలె  మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండాను ఎగురవేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లాల అధ్యక్షులు పాయల్​ శంకర్, కొత్తపల్లి శ్రీనివాస్, లోక ప్రవీణ్​రెడ్డి, నాయకులు లాలా మున్న, జోగు రవి, కోట్నక విజయ్ కుమార్ ,  కుంరం వందన తదితరులు పాల్గొన్నారు.