ప్రతీ విషయాన్ని రాజకీయం చేయొద్దు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ప్రతీ విషయాన్ని రాజకీయం చేయొద్దు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  • కేటీఆర్​తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి ఫైర్

జడ్చర్ల టౌన్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్  ఆరోపణలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. అరబిందో ఫ్యాక్టరీపై విచారణ చేయకపోతే తగులబెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. దీనిపై కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ‘ఫ్యాక్టరీ ఓనర్లను బెదిరించి​మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది, ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి తప్పుబట్టారు. 

తన నియోజకవర్గ రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానని, ఏ పోరాటమైనా చేస్తానన్నారు. చెరువులో చేపలు చనిపోతుండడంతో ముదిరాజ్​ బిడ్డల కోసం ప్రశ్నిస్తున్నానని చెప్పారు.  బీఆర్ఎస్​లో ఏ ఎమ్మెల్యే అయినా.. ఏ రోజైనా.. తనకు సంబంధించిన ఇష్యూపై మాట్లాడాడా? అని నిలదీశారు. ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కాంగ్రెస్​లో ఉందన్నారు. అధికారంలో ఉండగా రౌడీయిజం, అరాచకత్వ పాలన చూసి ప్రజలు బొంద పెట్టారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫ్యాక్టరీల్లో పొల్యూషన్  వచ్చినా కమీషన్  వస్తే చాలని ఊరుకున్నాడని విమర్శించారు. ఈ సమస్యపై మాట్లాడలేదని గుర్తించాలన్నారు.