సర్కారు స్కీములను చూసి ఓట్లేయండి : ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి

సర్కారు స్కీములను చూసి ఓట్లేయండి : ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఓటర్లను ఆ పార్టీ జడ్చర్ల అభ్యర్థి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి కోరారు. గురువారం ఆయన పట్టణంలోని పాతబజార్, చావిడీ, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అంతకుముందు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు బీఆర్ఎస్​లో చేరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో స్కాములు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. జడ్చర్లలో విస్తారమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ, అర్హులైన పేదలకు డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మూడ డైరెక్టర్ బాద్మి రవిశంకర్,  పిట్టల మురళి, బాదేపల్లి రంజిత్ బాబు, పాల రాంరెడ్డి, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.