ఇందూరు నగర అభివృద్ధికి తోడ్పడాలి : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

ఇందూరు నగర అభివృద్ధికి తోడ్పడాలి : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
  • ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్, వెలుగు : అధికారులు అంకితభావంతో పని చేసి ఇందూరు నగర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు. శనివారం నగరంలోని తన ఆఫీస్​లో మున్సిపల్ శాఖలోని పబ్లిక్​హెల్త్​, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అమృత్​ పథకం ద్వారా చేపట్టిన అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, మ్యాన్​హోల్స్​ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రతి డివిజన్​లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులకు సంబంధించిన టెండర్​ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రామర్తి చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు ప్రజారోగ్యం, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాల్లో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.