మార్కెట్ కమిటీ చైర్మన్లు రైతులకు అండగా నిలవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మార్కెట్ కమిటీ చైర్మన్లు రైతులకు అండగా నిలవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: వ్యవసాయ మార్కెట్​కమిటీల చైర్మన్లు నిత్యం అందుబాటులో ఉండి రైతులకు అండగా నిలవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యవసాయ మార్కెట్​ చైర్మన్ల కమిటీ సమావేశం ఆదివారం నర్సంపేట మార్కెట్​లో మార్కెట్ ​చైర్మన్ ​పాలాయి శ్రీనివాస్​అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కమిటీ కార్యవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.  

ఉమ్మడి వరంగల్​జిల్లా చైర్మన్​గా చందుపట్ల రాజిరెడ్డి.. 

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల కమిటీ జిల్లా చైర్మన్​గా పరకాల మార్కెట్​ చైర్మన్​చందుపట్ల రాజిరెడ్డి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా కేసముద్రం మార్కెట్​చైర్మన్​ గంటా సంజీవ్​రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనగామ మార్కెట్​చైర్మన్​బసుక శివరాజ్​యాదవ్, ఉపాధ్యక్షులుగా మహబూబాబాద్​మార్కెట్​చైర్మన్​సుధాకర్​నాయక్, నెక్కొండ మార్కెట్​చైర్మన్​రావుల హరీశ్​రెడ్డి, కార్యదర్శిగా కొడకండ్ల మార్కెట్​ చైర్మన్​నల్ల అండాలు శ్రీరామ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలకంటి లావణ్యాశిరీశ్​రెడ్డి, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..

నెక్కొండ: వరంగల్​జిల్లా నెక్కొండ వ్యవసాయమార్కెట్​కమిటీ చైర్మన్​రావుల హరీశ్​రెడ్డికి జిల్లా కమిటీలో చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు పదవి రావడానికి కృషిచేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.