దేవరకద్రకు రెండు పెద్ద దవాఖానలు : జి మధుసూదన్ రెడ్డి

దేవరకద్రకు రెండు పెద్ద దవాఖానలు : జి మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల, వెలుగు : దేవరకద్ర నియోజకవర్గానికి రెండు పెద్ద ఆసుపత్రులు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మండలంలోని రాచాల గ్రామంలో మంగళవారం పల్లె దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకద్ర కు 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటకు 30 పడకల ఆసుపత్రి కోసం ప్రపోజల్ పంపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిపారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం లివర్​ వ్యాధితో బాధ పడుతున్న మండల కేంద్రానికి చెందిన చిన్న కాశన్నకు రూ.1.25 లక్షల ఎల్ వోసీని అందజేశారు. తహసీల్దార్  ఘాన్సిరాం, ఎంపీడీవో మంజుల, శ్రీహరి, విజయమోహన్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.