హనుమకొండ జిల్లాలో రేషన్కార్డుల పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

 హనుమకొండ  జిల్లాలో రేషన్కార్డుల పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని లబ్ధిదారులకు శనివారం స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొత్త రేషన్​కార్డులను పంపిణీ చేశారు. ధర్మసాగర్​ మండలానికి 924 కొత్తకార్డులు రాగా, 2119 ఫ్యామిలీ మెంబర్స్​పేర్లు చేర్చారు. వేలేరు మండలానికి 552 కార్డులు రాగా, 1195 ఫ్యామిలీ మెంబర్స్​పేర్లు చేర్చారు.

కొత్త కార్డులను ఆయా మండలాల్లోని రైతు వేదికల్లో ఎమ్మెల్యే అడిషనల్​ కలెక్టర్​ వెంకట్​రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. వేలేరు మండలానికి చెందిన 9 మంది, ధర్మసాగర్​ మండలానికి చెందిన 17 మంది సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సదానందం, కొమి, ఎంపీడీవోలు అనిల్​కుమార్, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.