
జనగామ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేసి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్తో కలిసి కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాలకు మొత్తంగా 3500 ఇండ్లు కేటాయించగా, జనగామ జిల్లాలోని 5 మండలాల్లో 2486, హనుమకొండ జిల్లాలోని రెండు మండలాల్లో 1014 ఇండ్లు మంజూరయ్యాయన్నారు.
ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయవద్దన్నారు. వచ్చే నెల 3 వరకు క్షేత్ర స్థాయి నివేదిక అందించాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు పింకేశ్కుమార్, రోహిత్ సింగ్, ఆర్డీవో వెంకన్న, జనగామ, హనుమకొండ హౌసింగ్ పీడీలు తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లా కోసం కృషి చేయాలి
జనగామ అర్బన్: టీబీ రహిత జిల్లా కోసం కృషి చేయాలని, న్యూట్రిషన్ కిట్మంచి పోషకాహారం అని జనగామ కలెక్టర్రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం ఐఎంఏ సహాకారంతో జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టని కార్యక్రమంలో కలెక్టర్ 50 మంది క్షయ వ్యాధి రోగులకు ఉచిత న్యూట్రిషన్కిట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మల్లికార్జున్రావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.