సదాశివనగర్, వెలుగు : రామారెడ్డి మండల కేంద్రంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు మొగుళ్ల ప్రవీణ్ గౌడ్, సదాశివనగర్ ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి చారి, సొసైటీ డైరెక్టర్ లక్ష్మాగౌడ్, డైరెక్టర్లు రాహు, సత్యం, ల్యాగల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గణేశ్, మహిళ అధ్యక్షురాలు అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.
