చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి:  మర్రి జనార్దన్ రెడ్డి 

చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి:  మర్రి జనార్దన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని బీఆర్ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని ఈదమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి 2,13, 6 వార్డులలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ పట్టణంలో సీసీ రోడ్లు, స్ట్రీట్​ లైట్లు, ట్యాంక్ బండ్, మిషన్ భగీరథ, మెడికల్ కాలేజీ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.  ప్రజలే తనను ఆదరిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు నరేందర్, రాజు, గంగాధర్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.  

Also Read :- సిటీలో అభివృద్ధి పనులకు కేంద్రానివే నిధులు : బండి సంజయ్