- ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు : యువత క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో నిర్వహించిన 11వ జోనల్ లెవెల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్పోర్ట్స్ డ్రెస్ లను పంపిణీ చేసి మాట్లాడారు. ఆధునిక కాలంలో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారని, తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు.
అనంతరం ఆలూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆలూర్, నందిపేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ, ఆలూరు, బీజేపీ మండలాల అధ్యక్షులు మందుల బాలు, శ్రీకాంత్, పటేల్ రాజు పాల్గొన్నారు.
