
- ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు, వెలుగు : భూభారతి చట్టంతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని పడమటి నర్సాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ఎమ్మెల్యే మాట్లాడారు. భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్, జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.