రాజకీయాలకతీతంగా.. అన్న చెల్లెల్లా పని చేశాం

రాజకీయాలకతీతంగా.. అన్న చెల్లెల్లా పని చేశాం

ములుగు జిల్లా అభివృద్ధి కోసం తాను, జగదీష్​ అన్న, చెల్లెలు లాగా రాజకీయాలకతీతంగా కలిసి పని చేశామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వరంగల్​ జిల్లా ములుగు జడ్పీ ఛైర్మన్​ కుసుమ జగదీష్​ మృతి పట్ల ఆమె సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జగదీష్​ మృతి ములుగు జిల్లాకు తీరని లోటు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిది అని కొనియాడారు. రాజకీయంగా దూషణలు, విమర్శలకు దిగలేని నాయకుడని పేర్కొన్నారు. జగదీష్​ మానిసిక ఒత్తిడికి లోనయ్యాడని చెప్పారు.  ఆయన గుర్తుగా సంతాప దినాలు ప్రకటిస్తామని వివరించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే నరేందర్​ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.