- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పిట్లం, వెలుగు : కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మద్నూర్లో కాంగ్రెస్ సర్పంచ్అభ్యర్థి ఉషా సంతోష్ను గెలిపించుకోవాలని, మద్నూర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, ఇండస్ట్రీయల్ హబ్గా మారుస్తామన్నారు.
మద్నూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.20 కోట్లు మంజూరు చేశానని తెలిపారు. మరో రూ. 95 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో 112 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. స్థలం లేని వారి కోసం ప్రభుత్వం 10 ఎకరాలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
గతంలో నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఇక్కడి ఎమ్మెల్యే షిండే నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్కు వెళ్లిందని, దాన్ని తిరిగి మద్నూర్కు తీసుకొచ్చానని అన్నారు. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో జుక్కల్, మద్నూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
