సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో చెలరేగిన అసమ్మతిని చల్లార్చేందుకు ఎమ్మెల్యేలు స్కీములను ఎరవేస్తున్నారు! తాము తెచ్చిన లిస్టులనే ఎమ్మెల్యేలు ఫైనల్ చేస్తుండడంతో అసంతృప్త నేతలు ఖుషీ అవుతున్నారట! ఈ విషయం కొత్తగూడెం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇస్తే తాము బీఆర్ఎస్కోసం పనిచేసే ప్రసక్తి లేదని ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు హైకమాండ్కు అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే! కానీ హైకమాండ్ హరిప్రియకే టికెట్ ఇవ్వడంతో అసమ్మతి నేతలు నారాజ్ అయ్యారు.
కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు జరిపారు. అటు కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు అసమ్మతి గళం ఎత్తుతున్నారు. ఈ మున్సిపాలిటీలోని 24 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఇప్పటికే దాదాపు 12మందికి పైగా కౌన్సిలర్లు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో టచ్లోకి వెళ్లారట. దీంతో అలర్ట్ అయిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు స్కీమ్స్లు ఎరవేస్తున్నారనే టాక్ నడుస్తోంది. కౌన్సిలర్లు చెప్పిన వాళ్లకే రెండో విడత దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ సాయం, 58, 59 స్కీముల్లో ప్రాధాన్యం ఇస్తుండడంతో కామన్ పబ్లిక్నారాజ్ అవుతున్నారు. కౌన్సిలర్లు చెప్పినవాళ్ల పేర్లు కాకుండా అర్హులకు స్కీములు అందేలా చూడాలని కలెక్టర్కు విన్నవిస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.