లిక్కర్ స్కాంపై కవిత, రాజగోపాల్ ట్విట్టర్ వార్

లిక్కర్ స్కాంపై కవిత, రాజగోపాల్ ట్విట్టర్ వార్

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ల వార్​ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న సమీర్​ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీట్​ లో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అయితే దీనిపై ఓ పత్రికలో పతాక శీర్షికన ప్రచురితమైన కథనాన్ని షేర్​ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ఇవాళ చేసిన ట్వీట్​ పై కవిత స్పందించారు.

 ‘‘సమీర్​ మహేంద్రు చార్జిషీట్​ లో లిక్కర్​ క్వీన్​ పేరును 28 సార్లు ప్రస్తావించారు” అంటూ రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యకు కౌంటర్​ ఇచ్చారు. ‘‘రాజగోపాల్​ అన్న.. తొందరపడకు.. మాట జారకు!!  28 సార్లు  నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు”అని కవిత రిప్లై ఇచ్చారు.