చెన్నై : దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఏ కూటమికైనా తాను మద్దతు ఇస్తానని తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. పార్టీ 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మీడియా తో మాట్లాడారు. తమిళ నటుడు విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి రావడాన్ని కమల్ స్వాగతించారు. ‘ఇండియా’ కూటమిలో ఎంఎన్ఎం చేరుతుందా అని ప్రశ్నించగా, ‘దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఎవరితోనైనా ఎంఎన్ఎం కలిసి పని చేస్తుంది. అయితే, ఫ్యూడల్ రాజకీయాలు చేస్తున్న వారితో చేతలు కలపదు” అని ఆయన స్పష్టంచేశారు. మీరు ఇండియా కూటమిలో చేరారా? అని అడగగా, ఇంకా చేరలేదని సమాధానమిచ్చారు. అయితే, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని, పొత్తు ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్తామని కమల్ హాసన్ వెల్లడించారు.