RSS చీఫ్ మోహన్ భగవత్ తో ఈ రోజు సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. ఇందుకు గాను… నాగ్ పూర్ లోని RSS ప్రధాన కార్యాలయానికి మోడీ వెళ్లనున్నారు. మే 23న లోక్ సభ ఫలితాలు రానున్న నేపథ్యంలో ఈ బేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేల ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసినన్ని సీట్లు రాకపోతే ఎలా అన్న అంశంపై భేటీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత నాలుగేళ్లలో RSS ప్రధాన కార్యాలయానికి మోడీ వెళ్లడం ఇదే మొదటిసారి.
కేంధ్ర మంత్రి నితిన్ గడ్కరితో RSS ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ ఈరోజు ఉదయం సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాతనే ప్రధాని మోడీ తో భగవత్ సమావేశం ఫిక్స్ అయింది.