ప్రతికూల పరిస్థితుల్లోనే స్నేహం మరింత పెరుగుతుంది
ట్రంప్ కామెంట్లపై ట్విట్టర్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మానవత్వంతో ఎలాంటి సహాయం చేయడానికైనా ఇండియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతులకు అంగీకరించడంపై ఇండియాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు. “థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మీ బలమైన నాయకత్వం ఇండియాకే కాదు.. మొత్తం మానవాళికే ఈ పోరాటంలో ఎంతో సాయం చేస్తోంది”అని ట్రంప్ ట్వీట్ చేశారు. మోడీ అద్భుతమైన వ్యక్తి అని, ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనంటూ పేర్కొన్నారు. దీనిపై ట్విటర్ లో స్పందించిన ప్రధాని మోడీ “ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే స్నేహం మరింత పెరుగుతుంది. ఇండో–యూఎస్ మధ్య సంబంధాలు గతం కంటే ఇప్పుడు చాలా బలపడ్డాయి. కరోనాపై పోరాటంలో మానవాళికి ఎలాంటి సాయం చేసేందుకైనా ఇండియా రెడీగా ఉంటుంది”అని ట్వీట్ చేశారు.