మోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్

మోదీ మూడోసారి పీఎం అవుతారు : రాజస్థాన్ సీఎం భజన్ లాల్

మహబూబాబాద్, వెలుగు:  తెలంగాణ ప్రజలు అవినీతి కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కోరారు. దేశ ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని కొరుకుంటున్నారని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏర్పాటు చేసిన ‘పాలకుర్తి జనసభ’కు భజన్​లాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​ను గెలిపించాలని కోరారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని.. ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగిపోయారన్నారు. మార్పు అని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఆ పార్టీ గద్దెనెక్కిందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే తొర్రూరు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్​గా మారుస్తానని, కొడకండ్ల లో టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు కు కృషి చేస్తానని తెలిపారు.