కోహ్లీ వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ మొహాలీలోనే!

కోహ్లీ వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ మొహాలీలోనే!

న్యూఢిల్లీ: కెరీర్‌‌‌‌‌‌‌‌ వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ బెంగళూరులో ఆడాలనుకున్న మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ కల ఫలించేలా లేదు. ఈ నెల చివర్లో ఇండియాలో శ్రీలంక టూర్​ ​ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ మార్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం మొదటగా రెండు టెస్టులు బెంగళూరు, మొహాలీలో జరగాలి. తర్వాత మూడు టీ20ల సిరీస్​ను ప్లాన్​ చేశారు. కానీ, లంక బోర్డు రిక్వెస్ట్​ మేరకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20లు, తర్వాత టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఆడేందుకు ఇండియన్‌‌‌‌‌‌‌‌ బోర్డు అంగీకరించింది. ఈ లెక్కన ఈ నెల 24న ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20 లక్నోలో, 26, 27న ధర్మశాలలో తర్వాతి టీ20లు జరుగుతాయి. అక్కడి నుంచి రెండు టీమ్స్‌‌‌‌‌‌‌‌ మొహాలీకి వెళ్తాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు (మార్చి 3–7)  మొహాలీ ఆతిథ్యం ఇవ్వనుండగా, డే నైట్​ అయిన సెకండ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ (మార్చి12–16) బెంగళూరులో జరగనుంది. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టులు కంప్లీట్​ చేసుకున్నాడు. ఐపీఎల్ ఆర్​సీబీ టీమ్​ ద్వారా 14 ఏళ్లుగా  తనకు అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, సొంత ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ముందు వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆడాలన్న ఆశతో ఉన్నాడు. కానీ, లంక టూర్​ షెడ్యూల్​ను బోర్డు మార్చడంతో  విరాట్​కు నిరాశ తప్పలేదు.