నా కూతురిని చూడాలని ఉంది.. నా భార్య కలవనివ్వడం లేదు: మహమ్మద్ షమీ

నా కూతురిని చూడాలని ఉంది.. నా భార్య కలవనివ్వడం లేదు: మహమ్మద్ షమీ

టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. శస్త్ర చికిత్స కోసం UK లో ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి. వరల్డ్ కప్ లో టాప్ బౌలింగ్ తో టోర్నీ లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఏడు మ్యాచ్‌లలో 10.71 సగటుతో 24 వికెట్లు తీసుకొని భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే అర్జున అవార్డును అందుకున్నాడు. క్రికెట్ పరంగా షమీ ఎంత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నా..వ్యక్తిగత జీవితంలో షమీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

షమీ ప్రస్తుతం తన భార్యకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ళ క్రితం విడాకులు తీసుకున్న వీరిద్దరికీ ఒక పాప ఉంది. తాజాగా షమీ తన కూతురిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన మాజీ భార్య.. తన బిడ్డను కలవనివ్వడం లేదని విచారం వ్యక్తం చేశాడు. నా మాజీ భార్యతో కనెక్ట్‌ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నా కుమార్తె ఐరాను కలిసే  అవకాశం లభించడం లేదు. అని షమీ అన్నారు.   

నా మాజీ భార్య హసనీనా కావాలనే నా బిడ్డను నాకు చూపించడం లేదని తనను నేను బాగా మిస్ అవుతున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు. 2014లో షమీ, హసీనా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఐరా జన్మించింది. అయితే వివిధ కారణాలతో 2018లో షమీ, హసీనా విడిపోయారు. వరల్డ్ కప్ తర్వాత షమీ దూరంగా భారత జట్టుకు గాయం కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే, టెస్టు సిరీస్ లు తాజగా ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమయ్యాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు షమీ 64 టెస్టుల్లో 229 వికెట్లు.. 101 వన్డేల్లో 195 వికెట్లు తీశాడు. 23 టీ20 లు ఆడగా.. 24 వికెట్లు తీశాడు.